వారి గతే ఎర్రబెల్లి దయాకర్కు పడుతుంది: బీజేపీ నేత
ABN , First Publish Date - 2022-08-15T21:20:48+05:30 IST
వారి గతే ఎర్రబెల్లి దయాకర్కు పడుతుంది: బీజేపీ నేత
హైదరాబాద్: బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే తమపై ఎర్రబెల్లి దయాకర్ రావు దాడి చేయించారని బీజేపీ నేత సంగప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కడవెండి విస్నూర్ దొరలకు పట్టినగతే దయాకర్ రావుకు పడుతుందన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం టీఆర్ఎస్ దని విమర్శించారు. కేటీఆర్ సిరిసిల్లకు వెళితే తమ కార్యఖర్తలను ముందే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. కానీ మేము దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.