TS News: మావోయిస్టు రామన్న సతీమణి సావిత్రి లొంగుబాటు...

ABN , First Publish Date - 2022-09-21T19:45:55+05:30 IST

మావోయిస్టు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న భార్య సావిత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

TS News: మావోయిస్టు రామన్న సతీమణి సావిత్రి లొంగుబాటు...

వరంగల్ (Warangal): మావోయిస్టు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న (Ramanna) సతీమణి సావిత్రి (Savitri) పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన రామన్న... 2019లో గుండె పోటుతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో చనిపోయారు. రామన్నపై గతంలో పోలీసులు రూ. 40 లక్షల రివార్డు ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న రామన్న..1994లో దళం సభ్యురాలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా సావిత్రి వ్యవరిస్తున్నారు. రామన్న మరణం తర్వాత కొడుకు శ్రీకాంత్ పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పుడు సావిత్రి కూడా లొంగిపోవడం గమనార్హం.  

Updated Date - 2022-09-21T19:45:55+05:30 IST