నేడు ఇన్సెంటివ్ల కోసం ధర్నాలు
ABN , First Publish Date - 2020-08-09T13:22:46+05:30 IST
నేడు ఇన్సెంటివ్ల కోసం ధర్నాలు
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): పది శాతం ఇన్సెంటివ్ హామీ అమలు చేయనందుకు నిరసనగా ఆదివారం హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు మెడికల్ కాంట్రాక్టు, ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ సిటీ కౌన్సెల్ ఓ ప్రకటనలో తెలిపింది. సర్కారీ దవాఖానాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్ పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు ఇన్సెంటివ్ ఇస్తామని మార్చిలో సీఎం కేసీఆర్ ప్రకటించినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. గత నెలలో మంత్రి ఈటల ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తామని చెప్పి కాంట్రాక్టు శానిటేషన్ సిబ్బందితో సమ్మె విరమింపజేశారని యూనియన్ అధ్యక్షుడు నర్సింహ పేర్కొన్నారు. తమ ఆందోళనకు సర్కారు స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.