ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో వృద్దురాలికి టోకరా

ABN , First Publish Date - 2021-07-26T23:38:33+05:30 IST

ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో వృద్దురాలికి టోకరా

ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో వృద్దురాలికి టోకరా

హైదరాబాద్: ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో వృద్దురాలిని మోసం చేశారు. హైదరాబాద్‌కి చెందిన ఓ వృద్ధురాలితో ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించుకున్నారు. రివర్సల్ బోనస్‌ల పేరుతో సైబర్ కేటుగాళ్ళు ఆమెను మోసం చేశారు. ఆర్బీఐ, ప్రాసెసింగ్, సెబీ వివిధ చార్జీల పేరుతో 15.47 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు మార్చిలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి, ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు దేవానిష్, రస్టజీ, ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-07-26T23:38:33+05:30 IST