తెలంగాణలో అలాంటివేమీ లేవు.. స్పష్టం చేసిన కేంద్రం..
ABN , First Publish Date - 2020-09-22T11:45:20+05:30 IST
తెలంగాణలో బంగారం, వజ్రాల నిక్షేపాలు లభించలేదని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి వెల్లడించారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ జి.రంజిత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తెలంగాణలో బంగారం, వజ్రాల నిక్షేపాలు లభించలేదని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషి వెల్లడించారు. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ జి.రంజిత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహబూబ్నగర్, జోగులాంబ, వనపర్తి, నల్గొండ జిల్లాల పరిధిలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. కానీ బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు తేలలేదని వివరించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు సమాచారం లేదని పేర్కొన్నారు.