తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ABN , First Publish Date - 2021-02-23T21:30:31+05:30 IST

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్: తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసింది. ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. కాగా నిన్న అఫిడవిట్‌ సరిగ్గా లేనందున టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఇవాళ నామినేషన్‌ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది.. అభ్యర్థులు విత్ డ్రా చేసుకోడానికి 26వ తేదీ వరకు సమముంది. 

Updated Date - 2021-02-23T21:30:31+05:30 IST