ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

ABN , First Publish Date - 2021-12-18T02:03:42+05:30 IST

సీఎం కేసీఆర్ ఆదేశంతో శనివారం నాడు తెలంగాణ మంత్రుల

ఢిల్లీకి తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్ ఆదేశంతో శనివారం నాడు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళుతోందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ బృందంలో ఆరుగురు మంత్రులు సహా ప్రతినిధి బృందం ఉంటుందన్నారు. ప్రధాని దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్తామన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ నెల 20న అన్ని గ్రామాల్లో ఊరేగింపు, శవడప్పు కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-12-18T02:03:42+05:30 IST