మంత్రి గౌతమ్రెడ్డి మృతిపట్ల మంత్రి తలసాని సంతాపం
ABN , First Publish Date - 2022-02-21T15:10:20+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.