ఆస్పత్రిలో చేరిన మంత్రి కేటీఆర్‌ కుమారుడు!

ABN , First Publish Date - 2020-10-01T13:43:37+05:30 IST

సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది.

ఆస్పత్రిలో చేరిన మంత్రి కేటీఆర్‌ కుమారుడు!

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వివరాల్లోకెళితే.. హిమాన్షు కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షును బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. ఆ గాయంతో కనీసం నిలబడలేక బాధపడుతున్నట్లు తెలియవచ్చింది. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి సీటీ స్కాన్‌ చేయించారని తెలిసింది. ఈ స్కానింగ్‌లో తుంటి భాగం, మోకాలికి తీవ్రగాయం అయినట్లు వైద్యులు గుర్తించినట్లు సమాచారం. కాగా.. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో హిమాన్షుకు ఇలా గాయమైనట్లు సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-01T13:43:37+05:30 IST