Gaddar తో గంటకు పైగా మంత్రి, ఎమ్మెల్యే కీలక చర్చలు.. ఓకే అన్నారా..!?
ABN , First Publish Date - 2021-08-29T13:49:28+05:30 IST
గంటకు పైగా వారు మాట్లాడుకున్నారని సమాచారం. గద్దర్ మాత్రం వారికి హామీ...
- హుజూరాబాద్ ఉప ఎన్నికలో మద్దతు కోరిన మంత్రి, రసమయి
హైదరాబాద్ సిటీ/అల్వాల్ : ప్రజాగాయకుడు గద్దర్ను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి శనివారం అల్వాల్ భూదేవినగర్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం దళితుల సంక్షేమం కోసం దళిత బంధును తీసుకువచ్చారని, ఎంతో మంది పేద దళితులకు ప్రయోజనం చేకూరుతుందని వారు గద్దర్కు వివరించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం గద్దర్ మద్దతును మంత్రి అడిగినట్లు తెలుస్తోంది.
గంటకు పైగా వారు మాట్లాడుకున్నారని సమాచారం. గద్దర్ మాత్రం వారికి హామీ ఇవ్వలేదని, తటస్థంగా ఉండే అవకాశం ఉందని ఆయన శ్రేయోభిలాషులు పేర్కొంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు కూడగట్టడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రాంతాల వారీగా తిరుగుతండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.