ఆడపిల్లల చదువు ఇంటికీ, సమాజానికి వెలుగు: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

ABN , First Publish Date - 2022-03-08T00:28:06+05:30 IST

ఆడపిల్ల చదువు ఇంటికి, సమాజానికి వెలుగు అని చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమ శుభాకాంక్షలు తెలిపారు.

ఆడపిల్లల చదువు ఇంటికీ, సమాజానికి వెలుగు: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

హైదరాబాద్: ఆడపిల్ల చదువు ఇంటికి, సమాజానికి వెలుగు అని చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమ శుభాకాంక్షలు తెలిపారు. సోవియట్‌ ఉద్యమంలో ఓ మహిళ ప్రజల హక్కుల కోసం చేసిన దీక్షను ప్రపంచమంతా మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులను కల్పిస్తోందన్నారు. జీవితంలో తల్లిగా, చెల్లిగా, కూతురిగా, స్నేహితురాలిగా ఒక తరానికి ఇంకో తరానికి వారధిగా మార్గదర్శనం చేసే ప్రతి మహిళ విజేతనే అని కొనియాడారు. ఎన్నోసమస్యలను దాటుకుంటూ విజయ తీరాలను చేరే ప్రతి వనిత విజేతనే అని అన్నారు. ఆకాశమే తమ హద్దుగా అన్నింటా ఆడపడుచులు ఎదగాలని తమ కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-03-08T00:28:06+05:30 IST