తెలంగాణ మద్యం భారీగా స్వాధీనం
ABN , First Publish Date - 2020-08-08T10:15:30+05:30 IST
ముండ్లమూరు మండలంలో శుక్రవారం భారీగా తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం ..
ముండ్లమూరు/అద్దంకి ఆగస్టు 7: ముండ్లమూరు మండలంలో శుక్రవారం భారీగా తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కొమ్మవరంలో వైసీపీకి చెందిన మున్నంగి సంజీవరెడ్డికి చెందిన గోడౌన్లో సరుకును దాచి పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సై కె.రామకృష్ణ తన సిబ్బందితో గోడౌన్ తనిఖీ చేయగా 1824 క్వాటర్ బాటిల్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ తెలంగాణ రేటు ప్రకారం రూ.2,76,460 ఉంటుందని ఎస్సై తెలిపారు. సంజీ వరెడ్డితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైనట్లు ఎస్సై తెలిపారు. అద్దంకిలో 300 క్వార్టర్ల బాటిళ్ల తెలంగాణ మద్యాన్ని సీఐ శ్రీనివాసులు పట్టుకున్నారు. దీనివిలువ రూ.54 వేలు ఉంటుంది. నిందితులు చంద్రమౌళి, అంజమ్మ అరెస్టు చేయగా, మరో నిందితుడు సురేష్ పరారీలో ఉన్నారు.