రూ.50 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-12T06:21:40+05:30 IST

చెక్‌పోస్టుల వద్ద భారీగా తనిఖీలు చేపడుతున్నా అక్రమ వ్యాపారులు అడ్డుఆపు లేకుండా మద్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు.

రూ.50 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం

దాచేపల్లి, మే 11: చెక్‌పోస్టుల వద్ద భారీగా తనిఖీలు చేపడుతున్నా అక్రమ వ్యాపారులు అడ్డుఆపు లేకుండా మద్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. దాచేపల్లి మండలం పొందుగుల పోలీసు చెక్‌పోస్టు వద్ద మంగళ వారం రూ.50 లక్షల మద్యాన్ని తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. వరిపొట్టు బస్తాలు వేసి వేగంగా వస్తున్న లారీని గుర్తించిన పోలీసు సిబ్బంది లారీని పరిశీలించగా అడుగుభాగంలో దాచిన మద్యం నిల్వలు బయటపడ్డా యి. తెలంగాణకు చెందిన మద్యం దాచేపల్లి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా రు. పట్టుబడిన మద్యమంతా ఖరీదైనది కావటం విశే షం. ఎస్‌ఐ బాలనాగిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని, వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


Updated Date - 2021-05-12T06:21:40+05:30 IST