తెలంగాణ, కర్నాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ

ABN , First Publish Date - 2021-10-05T17:54:44+05:30 IST

తెలంగాణ, కర్నాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మంగళవారం రైల్ నిలయంలో సమావేశమయ్యారు.

తెలంగాణ, కర్నాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ

హైదరాబాద్:  తెలంగాణ, కర్నాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మంగళవారం రైల్ నిలయంలో సమావేశమయ్యారు.  తెలంగాణ, కర్నాటక రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, పనులు పూర్తి అయిన మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు, వచ్చే ఆర్థిక సంవత్సరం లో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సమావేశానికి హాజరుకాగా... రైల్వే జీ.ఎం సమావేశానికి బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. 

Updated Date - 2021-10-05T17:54:44+05:30 IST