దేశంలోనే తెలంగాణది అగ్రస్థానం
ABN , First Publish Date - 2020-06-03T10:34:13+05:30 IST
దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం భోలక్పూర్ డివిజన్ ముషీరాబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రెబ్బ రామారావు ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో షకీల్ అహ్మద్, ప్రఫుల్ రాంరెడ్డి, ఆర్.శ్రీనివాస్, విక్రమ్, సందీప్, జాకీర్, రాజుయాదవ్ పాల్గొన్నారు.