దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ

ABN , First Publish Date - 2022-08-14T04:10:06+05:30 IST

దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. శనివారం మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సీపతి పద్మబుచ్చన్న, వైస్‌ చైర్మన్‌గా గొట్ల రాజేష్‌యాదవ్‌, డైరెక్టర్లుగా భరత్‌కుమార్‌, జక్కు వ్రీనివాస్‌, అబ్దుల్‌ రజాక్‌, హరీష్‌గౌడ్‌, వొల్లాల నర్సాగౌడ్‌, యశోధబాస్కర్‌, భరత్‌నాయక్‌, కాంతామణి, వెంకటేష్‌, సంతోష్‌కుమార్‌, రాజమల్లు, ఎర్ర సునీత మహేష్‌లతో జిల్లా ఏడీ గజానంద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

జన్నారం, ఆగస్టు 13 : దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. శనివారం మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సీపతి పద్మబుచ్చన్న, వైస్‌ చైర్మన్‌గా గొట్ల రాజేష్‌యాదవ్‌, డైరెక్టర్లుగా భరత్‌కుమార్‌, జక్కు వ్రీనివాస్‌, అబ్దుల్‌ రజాక్‌, హరీష్‌గౌడ్‌, వొల్లాల నర్సాగౌడ్‌, యశోధబాస్కర్‌, భరత్‌నాయక్‌, కాంతామణి, వెంకటేష్‌, సంతోష్‌కుమార్‌, రాజమల్లు, ఎర్ర సునీత మహేష్‌లతో జిల్లా ఏడీ గజానంద్‌  ప్రమాణ స్వీకారం చేయించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మార్కెట్‌ గోదాముల కోసం ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌, కో ఆప్షన్‌  మున్వర్‌ ఆలీఖాన్‌, పొనకల్‌ సర్పంచు జక్కు భూమేష్‌, ఉపసర్పంచు శ్రీనివాస్‌గౌడ్‌, పీఏసీఎస్‌  చైర్మన్‌లు శీలం రమేష్‌, నాసాని రాజన్న, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్‌, సతీష్‌, సర్పంచులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-14T04:10:06+05:30 IST