తెలంగాణ ఇంటర్ ఫలితాల విధివిధానాలు ఇవే!
ABN , First Publish Date - 2021-06-23T23:23:09+05:30 IST
తెలంగాణ ఇంటర్ ఫలితాల విధివిధానాలు ఇవే!
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫస్టియర్లో వచ్చిన మార్కులే సెకండియర్కు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రాక్టికల్స్లో100 శాతం మార్కులు ఇవ్వనుంది. బ్యాక్లాగ్స్ ఉంటే 35శాతం మార్కులతో పాస్ చేయనుంది. ప్రైవేట్గా పరీక్ష రాసే విద్యార్థులకు 35శాతం పాస్ మార్కులు ఇవ్వనున్నారు. ఈ క్రైటీరియా నచ్చని విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా కారణంగా తెలంగాణ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఇస్తారనే ఉత్కంఠ విద్యార్థుల్లో నెలకొంది. ఫస్టియర్లో కూడా వీరిని గ్రేడ్ల విధానంతో పాస్ చేశారు. సెండియర్ ఎలా ఫలితాలు ఇస్తారోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది కూడా అదే విధానంలో పాస్ చేస్తామని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న టెన్షన్, అనుమానాలకు తెరపడింది.