తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి రేపు

ABN , First Publish Date - 2021-12-02T06:54:54+05:30 IST

మండలంలోని పొడిచేడు గ్రామంలో శు క్రవారం తెలంగాణ మ లిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీ కాంతాచారి 12వ వర్ధంతిని నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకర మ్మ, మార్కెట్‌ కమిటీ చై ర్మన కొణతం యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌ తెలిపారు.

తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి రేపు
సమావేశంలో మాట్లాడుతున్న శంకరమ్మ

మోత్కూరు, డిసెంబరు 1: మండలంలోని పొడిచేడు గ్రామంలో శు క్రవారం తెలంగాణ మ లిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీ కాంతాచారి 12వ వర్ధంతిని నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకర మ్మ, మార్కెట్‌ కమిటీ చై ర్మన కొణతం యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్‌ తెలిపారు. బుధవారం మోత్కూరు మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, ఎర్రబెల్లి ద యాకర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ హాజరవుతారని తెలిపారు. టీఆర్‌ఎ స్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సర్పంచ పేలపూడి మధు, నాయకులు కొండ సోంమల్లు, గజ్జి మల్లేష్‌, విష్ణుమూర్తి, తి రుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:54:54+05:30 IST