తెలంగాణలో కరోనా పరిస్ధితులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-01-04T17:18:49+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

తెలంగాణలో కరోనా పరిస్ధితులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కరోనా పరిస్థితులపై డీహెచ్, డీజీపీ హైకోర్టుకు నివేదికను సమర్పించారు. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనలపై 907 కేసులు నమోదు అయ్యాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సమయానికి మించి వేడుకలు నిర్వహించినందుకు 263 కేసులు నమోదు అయ్యాయని, పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు చేసినట్లు చెప్పారు. అలాగే మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నామని కోర్టుకు తెలిపారు. గత నెల 24 నుంచి ఈ నెల 2 వరకు 16,430 మందికి జరిమానా వేశామన్నారు. జూన్ 20 నుంచి డిసెంబరు 23 వరకు 5,10,837 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు. ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వడం లేదని, జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టు తెలియజేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కోర్టులు, విద్యా సంస్థలు ఆన్ లైన్‌లో నిర్వహించాలని  పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు కరోనా పరిస్థితులపై తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. 

Updated Date - 2022-01-04T17:18:49+05:30 IST