నేడు హైకోర్టులో సెక్రటేరియట్ కూల్చివేతపై విచారణ

ABN , First Publish Date - 2020-07-13T15:04:58+05:30 IST

సెక్రటేరియట్ కూల్చివేతపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కూల్చివేత వల్ల

నేడు హైకోర్టులో సెక్రటేరియట్ కూల్చివేతపై విచారణ

హైదరాబాద్ : సెక్రటేరియట్ కూల్చివేతపై నేడు మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కూల్చివేత వల్ల వచ్చే దుమ్మూ ధూళితో శ్వాస కోస వ్యాధులు వస్తున్నాయని ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్‌రావు పిల్ దాఖలు చేశారు. సోమవారం వరకు కూల్చివేత ఆపేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కూల్చివేతకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కూల్చివేతలు నిలిపివేసింది. ఇవాళ ఈ వ్యవహారంపై హైకోర్టు ఏం చెప్పబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-07-13T15:04:58+05:30 IST