Supreme Court జడ్జిలు సూర్యకాంత్, పార్దివాలాపై అభిశంస తీర్మానం పెట్టాలి: Telangana High Court న్యాయవాదుల డిమాండ్
ABN , First Publish Date - 2022-07-06T17:32:48+05:30 IST
నూపూర్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం కొనసాగుతోంది.
హైదరాబాద్: నూపూర్ శర్మ(Nupur Sharma) కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తుల వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. నూపూర్ శర్మ కేసులో న్యాయమూర్తులు జడ్జీలు సూర్యాకాంత్, పార్దివాలా రాజ్యాంగం విరుద్ధం వ్యవహిరించారని తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) న్యాయవాదుల(Lawyers) ఆందోళన చేపట్టారు. సుప్రీం జడ్జీలు సూర్యాకాంత్(surya Kanth), పార్దివాలా(Pardiwala)పై అభిశంస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తులను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), రాష్టపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రిలకు తెలంగాణ న్యాయవాదులు లేఖ రాశారు.
నూపుర్ శర్మపై మరో పిటిషన్..
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ(Nupru Sharma)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆమెను అరెస్టు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది.