శ్రీవారి సేవలో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2022-05-21T02:57:39+05:30 IST
ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ సంతోష్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల: ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాసరెడ్డి, జస్టిస్ సంతోష్ రెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వేరువేరుగా ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయక మండపంలో న్యాయమూర్తులకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.