కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-05-17T17:07:13+05:30 IST

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ నెల 14 లాక్‌డౌన్ రీలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీని ముగ్గురు కమిషనర్లు  కోర్టుకు సమర్పించారు. జైళ్ల శాఖలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌పై జైళ్ల శాఖ పూర్తి నివేదికను సమర్పించింది. మల్లాపూర్‌లో 8 నెలల గర్భవతి చనిపోయిన దానిపైన వివరణ ఇవ్వాలని  హైకోర్టు కోరింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మార్కెట్లలో ఎక్కడ కూడా భౌతిక దూరం పాటించండం లేదని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. వాదనలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-05-17T17:07:13+05:30 IST