విశాఖకు తరలించొద్దు..కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

ABN , First Publish Date - 2021-01-20T01:39:50+05:30 IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించవద్దని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డును విశాఖకు తరలించవద్దని..

విశాఖకు తరలించొద్దు..కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించవద్దని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డును విశాఖకు తరలించవద్దని విజ్ఞప్తి చేసింది. సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం తగదని స్పష్టం చేసింది. బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామంటేనే ఒప్పుకున్నామని వివరించింది. విశాఖలో ఉంటే కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తాయని తేల్చి చెప్పింది. ఎపెక్స్ కమిటీలో చర్చించకుండా విశాఖలో ఏర్పాటు చేస్తామనడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Updated Date - 2021-01-20T01:39:50+05:30 IST