నేను బాధపడను... నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నా: Tamilisai
ABN , First Publish Date - 2022-06-02T16:52:53+05:30 IST
రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అవకాశం కల్పించారని గవర్నర్ తమిళిసై అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అవకాశం కల్పించారని గవర్నర్ తమిళిసై(Tamilisai) అన్నారు. రాజ్భవన్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘‘నేను బాధపడను.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నా. రాష్ట్రానికి గవర్నర్ కాదు.... మీ అందరి సహోదరిని... ఎవ్వరు ఆపినా కూడ మీ అందర్ని కలుస్తున్నా’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.