ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలి: వంశీచంద్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-05T20:59:57+05:30 IST

ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి కోరారు. కేంద్రం అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినట్టు..

ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలి: వంశీచంద్‌రెడ్డి

హైదరాబాద్: ఆల్మట్టి ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి కోరారు. కేంద్రం అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపినట్టు.. కర్ణాటక ఇరిగేషన్‌మంత్రి రమేష్ స్వయంగా ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్, కర్ణాటక సీఎంతో మాట్లాడి.. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణకు రావాల్సిన 130 టీఎంసీలను కర్ణాటక వాడుకోనుందని, తక్షణమే అఖిలపక్షాన్ని పిలిచి కర్ణాటక ఎత్తుగడల్ని తిప్పికొట్టాలని వంశీచంద్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-07-05T20:59:57+05:30 IST