ఏబీఎన్ ఎఫెక్ట్.. తెలుగు విద్యార్థుల బాధలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-04-08T14:35:35+05:30 IST

అమరావతి: ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల బాధలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.

ఏబీఎన్ ఎఫెక్ట్.. తెలుగు విద్యార్థుల బాధలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

అమరావతి: ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల బాధలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏబీఎన్ కథనం చూసిన వెంటనే తెలంగాణ విద్యార్థులకు అధికారులు ఫోన్ చేశారు.


బస్సుల్లో తీసుకువెళతామని ఎంతమంది ఉన్నారో చెప్పాలని కోరారు. అయితే నేటి వరకూ ఆంధ్ర అధికారులు మాత్రం స్పందించలేదు. 16వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండాలని ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ అధికారుల స్పందన గురించి చెప్పినా కూడా ఏపీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీకి చెందిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-04-08T14:35:35+05:30 IST