తెలంగాణ ప్రభుత్వం నీటిని అక్రమంగా వాడుకుంటోంది: మైసూరారెడ్డి

ABN , First Publish Date - 2021-07-21T18:02:31+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని మాజీమంత్రి మైసూరారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం నీటిని అక్రమంగా వాడుకుంటోంది: మైసూరారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని మాజీమంత్రి మైసూరారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని తప్పుబట్టారు. ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవచ్చుకదా అని సూచించారు. ఎందుకు భేషజాలు అడ్డం వస్తున్నాయని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని హితవుపలికారు. కేంద్రం నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మైసూరారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-21T18:02:31+05:30 IST