ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2020-06-02T23:27:46+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నగర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వివిధ పక్షాలు, సంఘాలు అవతరణ దినోత్సవాన్ని జరిపాయి.

ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నగర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా వివిధ పక్షాలు, సంఘాలు అవతరణ దినోత్సవాన్ని జరిపాయి. ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో లింగోజిగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్‌పార్క్ కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గుర్తించి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారని.. కాంగ్రెస్ పార్టీ కృషితోనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, అంజయ్య గౌడ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ గౌడ్, మహేశ్వరమ్మ, విజయపాల్ రెడ్డి, గౌస్ ఉద్దీన్, నవీన్ ముదిరాజ్, కరణ్, సుధీర్ రెడ్డి, జగదీశ్, మల్లారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 




లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిలక్ రావు ఆధ్వర్యంలో సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T23:27:46+05:30 IST