తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని సందర్శించిన డెహ్రాడూన్ డైరెక్టర్

ABN , First Publish Date - 2021-12-18T00:41:35+05:30 IST

దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని డెహ్రాడూన్ కు చెందిన ఇందిరాగాంధీ జాతీయ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ భరత్ జ్యోతి శుక్రవారం సందర్శించారు.

తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని సందర్శించిన డెహ్రాడూన్ డైరెక్టర్

హైదరాబాద్: దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని డెహ్రాడూన్ కు చెందిన ఇందిరాగాంధీ జాతీయ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ భరత్ జ్యోతి శుక్రవారం సందర్శించారు.జాతీయ స్థాయితో పాటు, వివిధ రాష్ట్రాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ఎంపికైన అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సౌకర్యాలు, విద్యా బోధన, క్షేత్రస్థాయి శిక్షణ, తదితర అంశాలను ఆయన పరిశీలించారు.అడవులు, పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవను అభినందించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ అకాడమీ ఆవరణలో మొక్క నాటారు. 

Updated Date - 2021-12-18T00:41:35+05:30 IST