EAMCET రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచి అంటే..

ABN , First Publish Date - 2021-10-14T13:48:16+05:30 IST

రాష్ట్రంలో ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ను..

EAMCET రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచి అంటే..

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ను నవంబరులో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 20న సమావేశమై ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాలను ఈనెల 15న ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 16 నుంచి మొదలు కానుంది. ఈ నెలాఖరు నాటికి మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T13:48:16+05:30 IST