తెలంగాణలో 68 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-06T16:41:55+05:30 IST

తెలంగాణలో 68 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

తెలంగాణలో 68 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా బారిన పడిన డాక్టర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఉస్మానియాలో 41 మంది డాక్టర్లు, గాంధీలో నలుగురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. నిమ్స్‌లో 12మంది డాక్టర్లు, 8 మంది పారమెడికల్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. అలాగే డెంటల్ విద్యార్థులు ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం 68 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా పొజిటివ్‌గా తేలింది. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2020-06-06T16:41:55+05:30 IST