ఒక్కడితో తెలంగాణ రాలేదు: కోదండరాం
ABN , First Publish Date - 2021-03-08T07:54:46+05:30 IST
ఏ ఒక్కడితోనో రాష్ట్రం రాలేదని, అందరం కలిసికట్టుగా సాధించుకున్న తెలంగాణ గద్దెపై కూర్చున్న సీఎం కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తూ ఉద్యమకారుల ఆకాంక్షలకు భంగం కలిగిస్తున్నారని టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు.
మిర్యాలగూడ టౌన్, మార్చి 7: ఏ ఒక్కడితోనో రాష్ట్రం రాలేదని, అందరం కలిసికట్టుగా సాధించుకున్న తెలంగాణ గద్దెపై కూర్చున్న సీఎం కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తూ ఉద్యమకారుల ఆకాంక్షలకు భంగం కలిగిస్తున్నారని టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పట్ల ప్రభుత్వ వైఖరి చూస్తోంటో బాధ కలుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా టీఆర్ఎ్సకు గట్టి హెచ్చరిక పంపాలని ఆయన అన్నారు.