తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునేవారికి సంబంధించి డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-06-02T23:58:26+05:30 IST

తెలంగాణ నుంచి అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు పాసులు అవసరం లేదని రాష్ట్ర డీజీపీ కార్యాలయం...

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునేవారికి సంబంధించి డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన

అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు పాసులు అవసరం లేదు: తెలంగాణ డీజీపీ

హైదరాబాద్: తెలంగాణ నుంచి అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు పాసులు అవసరం లేదని రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల రిజిస్ట్రేషన్ యాప్‌లలో ప్రయాణ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది. ఏపీ వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌లో, కర్ణాటక వెళ్లేవారు సేవా యాప్‌లో, మహారాష్ట్ర వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీజీపీ కార్యాలయం సూచించింది. తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాసులు అడగడం లేదని తెలిపింది.


ఇదిలా ఉంటే.. ఏపీ డీజీపీ కార్యాలయం కూడా ప్రజా రవాణాపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న షరతులు కొనసాగుతాయని ఏపీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7 రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-02T23:58:26+05:30 IST