తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో బోనాల పండుగ

ABN , First Publish Date - 2021-07-27T01:39:18+05:30 IST

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సింగపూర్ సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో నిబంధనల ప్రకారం బోనాలు సమర్పించారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో బోనాల పండుగ

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సింగపూర్ సుంగే కేడుట్‌లోని శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో నిబంధనల ప్రకారం బోనాలు సమర్పించారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పరిమిత సంఖ్యలో బోనాలు సమర్పించారు. సమస్త ప్రజలపై మహంకాళి తల్లి ఆశిస్సులు ఉండాలని, ప్రపంచాన్ని కరోనా కోరల నుంచి కాపాడాలని సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది సుమారు వేయి మంది భక్తులతో బోనాల ఊరేగింపులో పోతరాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. ఈ బోనాల పండుగను సింగపూర్‌కు ఐదేళ్ల క్రితం పరిచయం చేయడం ద్వారా టీసీఎస్ఎస్ పేరు చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని కార్యవర్గ సభ్యులు చెప్పారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను భావితరాలకు అందజేయడంలో ఇక్కడి ఏకైక తెలంగాణ సంస్థ, టీసిఎస్ఎస్ ఎప్పుడు ముందుంటూ నిర్విరామంగ కృషి చేస్తుందన్నారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో సంస్థ ఉపాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్ కస్తూరి, గోనె నరేందర్ రెడ్డి రజిత, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్ స్వాతి, వ్యవస్థాపక పూర్వ అధ్యక్షుడు బండ మాధవ రెడ్డి శ్రీదేవి దంపతులు ఉన్నారు. వీరితో పాటు సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి దంపతులు సొసైటీ తరపున ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సునీత రెడ్డి, రోజా రమణి, గోనె రజిత, జూలూరు పద్మజ, కాసర్ల శ్రీనివాసరావు సమన్వయకర్తలుగా వ్యవరించారు. 


Updated Date - 2021-07-27T01:39:18+05:30 IST