ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట

ABN , First Publish Date - 2022-04-20T00:59:24+05:30 IST

ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట

ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో తెలంగాణ దంపతులకు ఊరట లభించింది. దొంగబాబా ఆశ్రమంలో ఉన్న కూతురిని కలిసేందుకు అనుమతి ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. దొంగబాబా ఆశ్రమంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రోహిణి ప్రాంతంలో ఆధ్యాత్మిక విద్యాలయం పేరుతో దొంగబాబా వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమం స్థాపించారు. తమ కూతురు సంతోష్ రూపను తప్పుదోవ పట్టించి ఆశ్రమంలో నిర్భందించారని తల్లిదండ్రుల పిటిషన్ దాఖలు చేశారు. ఆశ్రమంలో 168 మంది యువతులు బందీలుగా ఉన్నారని, ఇరుకు గదుల్లో ఉంచి నిర్వాహకులు మాదకద్రవ్యాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. దొంగ బాబా వీరేంద్ర దీక్షిత్ పరారీలో ఉన్నారు. సీబీఐ లుక్‌అవుట్ నోటీస్ చేసింది. ఆచూకీ చెప్పినవారికి రూ.5 లక్షల నజరానా ప్రకటించింది.

Updated Date - 2022-04-20T00:59:24+05:30 IST