తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-11T15:07:54+05:30 IST
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,647కు చేరుకోగా...645 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 22,628 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 59,374 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణలో 6,42,875 కరోనా టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 338 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే రంగారెడ్డి 147, కరీంనగర్ 121, మేడ్చల్ 119, వరంగల్ అర్బన్ 95, గద్వాల్ 85, జనగామ 71, కామారెడ్డి 71, పెద్దపల్లి 66 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.