తెలంగాణలో కరోనా టెన్షన్...సెలవులు పొడిగించనున్న సర్కార్

ABN , First Publish Date - 2022-01-11T18:36:16+05:30 IST

తెలంగాణలో కరోనా టెన్షన్ నెలకొంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

తెలంగాణలో కరోనా టెన్షన్...సెలవులు పొడిగించనున్న సర్కార్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా టెన్షన్ నెలకొంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈనెల 20వ వరకు సెలవులు పొడిగించే అవకాశం ఉంది. సంక్రాంతిని పండుగ సందర్భంగా ఇప్పటికే  ఈనెల 10 నుండి 16 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని మరో నాలుగు రోజులు పొడిగించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-01-11T18:36:16+05:30 IST