తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు.. 9 మరణాలు
ABN , First Publish Date - 2020-09-29T14:47:46+05:30 IST
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. అలాగే మొత్తం మృతుల సంఖ్య 1116గా నమోదు అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో 29,477 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స పొంది 1,58,690 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 23,934 మంది హోం ఐసోలేషన్లలో ఉన్నారు. జీహెచ్ఎంసీలో 283, కరీంనగర్ 109, మేడ్చల్ 160, నల్లగొండ 139, రంగారెడ్డి 161 కరోనా కేసులు నమోదు అయ్యాయి.