తెలంగాణలో 44కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-03-26T22:16:19+05:30 IST
తెలంగాణలో 44కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరింది. తెలంగాణలో ఇవాళ మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కుత్బుల్లాపూర్కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అలాగే దోమలగూడలో ఇద్దరు ప్రైవేటు డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్న డాక్టర్లు ఇద్దరూ దంపతులుగా గుర్తించారు. కరోనా రోగులతో సన్నిహితంగా ఉండటంతో డాక్టర్కు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. భర్త నుంచి భార్యకు వైరస్ సోకింది. మూడు కొత్త కేసులు కాంటాక్ట్ కేసులు కావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. డాక్టర్లు క్లినిక్లో ఎంతమందికి చికిత్స చేశారు? ఎంతమందిని కలుసుకున్నారు అనే విషయాలపై అధికారుల ఆరా తీస్తున్నారు.