టీ కాంగ్రెస్లో కొత్త జోష్.. నేతల సెటైర్లు.. నవ్వులే.. నవ్వులు
ABN , First Publish Date - 2020-08-09T21:04:40+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపించింది. నేతల మధ్య ఆహ్లాద వాతావరణం నెలకొంది. నేతలంతా ఉల్లాసంగా గడిపారు. ఇందుకు గాంధీ భవన్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ కనిపించింది. నేతల మధ్య ఆహ్లాద వాతావరణం నెలకొంది. నేతలంతా ఉల్లాసంగా గడిపారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో సీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశం జరుగుతుండగా జగ్గారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘మీ పని నయం అన్న.. గడ్డాలు, మీసాలు పెంచావు.. మాస్క్ కూడా అవసరం లేదు.. అందరం మాస్క్లు ధరిస్తే నీకు మాత్రం ఏ మాస్క్ అవసరం లేదు’ అంటూ జగ్గారెడ్డిపై రాజ్గోపాల్రెడ్డి ఛలోక్తులు విసిరారు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అలాగే ఈ సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ్ముడు రాజ్గోపాల్ను ఎక్కడ ఉన్నావంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేకంగా పలకరించారు. ఫామ్హౌస్లో ఉన్నానంటూ రాజ్గోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో జైరాం రమేష్ను కలిశావు కదా.. కరోనా టెస్టు చేయించుకోవాలంటూ వెంకట్రెడ్డి సూచించారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ఆసక్తికరమైన సన్నివేశంలో రేవంత్రెడ్డి కూడా నవ్వుకున్నారు.