బ్రేకింగ్ : కరోనాతో తెలంగాణ కాంగ్రెస్ నేత మృతి

ABN , First Publish Date - 2020-07-13T15:16:57+05:30 IST

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది.

బ్రేకింగ్ : కరోనాతో తెలంగాణ కాంగ్రెస్ నేత మృతి

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356 మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనాతో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబీకులు, అనుచరులు, ఆప్తులు, బంధువులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది.! దీంతో యశోద ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. కాగా.. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది.

Updated Date - 2020-07-13T15:16:57+05:30 IST