దేశాన్ని Bjp జలగలా పట్టి పీడిస్తోంది: Cm Kcr
ABN , First Publish Date - 2022-07-11T00:03:43+05:30 IST
దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో...
హైదరాబాద్ (Hyderabad): దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ (Cm Kcr) అన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఆయన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో(Bjp national excutive meeting)లో ప్రధాని ఏం మాట్లాడారో ఆయనకే తెలియాలన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రధానిని అడిగానని.. ఏ ఒక్క దానికి కూడా రిప్లై రాలేదని చెప్పారు. సమాధానం చెప్పకుండా తమ డొల్లతనం చూపించుకున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి మోదీ సర్కార్ చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు.