శరద్ పవార్తో కేసీఆర్ భేటీ
ABN , First Publish Date - 2022-02-20T22:59:15+05:30 IST
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు.
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ముంబైలోని పవార్ నివాసం సిల్వర్ ఓక్స్లో వీరు సమావేశమయ్యారు. ఆ సమయంలో సుప్రియా సులే కూడా అక్కడే ఉన్నారు.
పవార్తో సమావేశానికి ముందు కేసీఆర్ ముంబైలోని వర్షా బంగ్లాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యారు. కేసీఆర్తో పాటు ఎంపీ సంతోష్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి కట్టేందుకు ముందడుగు వేసిన కేసీఆర్ అందులో భాగంగానే ఉద్ధవ్తో భేటీ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఉద్ధవ్ కేసీఆర్కు ఫోన్ చేసి బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్కు ఫోన్ చేసి ఇప్పటికే మద్దతు తెలిపారు.