ఆయిల్పామ్ సాగుతో నాలుగు రెట్ల ఆదాయం: సీఎస్
ABN , First Publish Date - 2021-10-14T09:06:17+05:30 IST
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు....
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 5లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్య లు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. ఉద్యానవన, పరిశ్రమల శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని కేబినెట్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించినట్లు వివరించారు. వరితో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు ద్వారా 4-5 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చంటూ ఓ అధ్యయ నం ద్వారా తేలిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 18 నర్సరీలను ఏర్పాటు చేశామని.. వాటి ద్వారా 23.41 లక్షల ఆయిల్ పామ్ మొలకలు లభించాయని.. 36000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు అవి సరిపోతాయని అధికారులు వివరించారు. 2.11కోట్ల ఆయిల్ పామ్ మొలకల సరఫరా కోసం వివిధ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.