తెలంగాణ సీఎం సహాయ నిధికి ఇవాళ ఒక్కరోజే...
ABN , First Publish Date - 2020-04-01T01:21:05+05:30 IST
కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. పలువురు ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులు సహాయ నిధికి విరాళాలు అందజేశారు. ఇవాళ ఒక్కరోజే పలువురు భారీగా విరాళాలు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కావాల్సిన చెక్కులను మంత్రి కేటీఆర్కు ప్రగతిభవన్లో అందించారు. ఇవాళ ఒక్కరోజే.. మొత్తం 8 కోట్లా 72 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళంగా ప్రకటించారు. సమాజం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు, వ్యక్తులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కేటీఆర్కు చెక్కులు అందించిన వారి వివరాలు.
:- దివీస్ లేబరేటరీస్ 5 కోట్లు
:- గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు
:- VIRCHOW పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు
:- ఐఆర్ఎ రియాల్టీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 లక్షలు
:- Suchir Indiaప్రైవేట్ లిమిటెడ్ రూ. 25 లక్షలు
:- MGB కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 20 లక్షలు
:- మానవీయ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ. 20 లక్షలు
:- దండు రాజేష్ రూ. 15 లక్షలు
ఇంకా..
మాధవరం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింథోకెమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓషన్ స్పార్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, భూపతిరాజు హెల్పింగ్ హాండ్స్, మిరియాల చిన్న రాఘవరావు, ఆర్అండ్ఆర్ రియల్టర్లు రూ. 10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. వీరితోపాటు మహేశ్వరి మైనింగ్ అండ్ ఎనర్జీ రూ. 5లక్షలు, నిఖిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.2 లక్షలు చెక్కులను మంత్రి కేటీఆర్కు అందించారు.