రేపు Telangana కేబినెట్ అత్యవసర భేటీ
ABN , First Publish Date - 2022-01-16T15:42:52+05:30 IST
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యల కోసం రేపు(సోమవారం) కేబినెట్ అత్వసవరంగా భేటీకానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలను ప్రభుత్వం విధించే అవకాశం ఉంది.
స్కూళ్లకు సెలవులు పొడిగింపు...
మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండటంతో విద్యాసంస్థలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 8 నుంచి ఈరోజు వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వగా... ప్రస్తుతం వాటిని ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు.