బీజేపీతో టచ్‌లో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎవరు?

ABN , First Publish Date - 2021-11-27T23:25:35+05:30 IST

టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో..

బీజేపీతో టచ్‌లో ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎవరు?

హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ చర్చకు దారి తీసింది. ఇతర పార్టీల నేతలు తమ పార్టీల్లో చేరుబోతున్నారని చాలా సందర్భాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అన్నారు. అయితే ఇటీవల వరికి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య విమర్శలు, మాటల యుద్ధం నడుస్తోంది. అంతేకాదు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ ఆందోళనలు నిర్వహించాయి. ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లినా యాసంగిలో వరిని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసే పరిస్థితి లేదని కేంద్రం తేల్చి చెప్పింది.


మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఆ పార్టీకి రెబల్స్‌గా పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలయి ఉండి రెబల్స్‌గా  ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేస్తోందని, వాళ్లంతా తమ పార్టీ వైపు చూస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘2022 రాజకీయం ఎలా ఉండబోతోంది?. ఎవరు ఎవరికి బీ టీమ్?. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు?. కేబినెట్ ప్రక్షాళన తర్వాత పరిణామాలు మారబోతున్నాయా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-11-27T23:25:35+05:30 IST