శంశాక్ గోయల్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2021-09-30T00:33:49+05:30 IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శంశాక్ గోయల్‌ను తెలంగాణ బీజేపీ నేతలు కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నినకు పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

శంశాక్ గోయల్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శంశాక్ గోయల్‌ను తెలంగాణ బీజేపీ నేతలు కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నినకు పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. హుజురాబాద్‌లో ఉన్న టీఆర్ఎస్ హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని కోరారు. ఆర్టీసీ బస్సులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచార పోస్టర్లను తొలగించాలని కోరామని తెలిపారు. హుజురాబాద్‌లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నిర్వహించే కుల సంఘాల సమావేశాలను పోలీసులే నిర్వహిస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-09-30T00:33:49+05:30 IST