బెంగళూర్‌లో కేసీఆర్‌ను కలిసిన బిసి కమిషన్‌ చైర్మన్‌ Krishna mohan

ABN , First Publish Date - 2022-05-26T22:37:50+05:30 IST

గత రెండు రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటనలోఉన్నతెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్‌(telangana bc comissoin) బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసింది.

బెంగళూర్‌లో కేసీఆర్‌ను కలిసిన బిసి కమిషన్‌ చైర్మన్‌ Krishna mohan

బెంగళూరు: గత రెండు రోజులుగా తమ అధ్యయనంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర పర్యాటనలోఉన్నతెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్‌(telangana bc comissoin) బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసింది.గురువారం బెంగళూర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్థానిక లీలా ప్యాలెస్‌లో కమిషన్‌ చైర్మన్‌ డా॥ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు(krishna mohan rao) సారధ్యంలో సభ్యులు సిహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌ పటేల్‌ నూలి, కె.కిషోర్‌ గౌడ్‌లు ప్రత్యేకంగా కలిశారు. 


ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను సీఎమ్‌ కేసీఆర్‌కు వివరించారు. మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజిక వేత్తలు, తదితరులను కలుసుకోనున్నట్లు చైర్మన్‌ వివరించారు. బిసి కమిషన్‌ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు, ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Updated Date - 2022-05-26T22:37:50+05:30 IST